మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టులు 20 లక్షలు దాటాయి. మార్చి 2వ తేది నుంచి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 20,16,461 పరీక్షలు జరిగాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు వైద్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా గురువారం 62, 890 మందికి టెస్టులు చేయగా 2426 మందికి పాజిటివ్ తేలింది. వీరిలో జిహెచ్ఎంసిలో 338 మంది ఉండగా, ఆదిలాబాద్లో 25, భద్రాద్రి 67, జగిత్యాల 62, జనగామ 33, భూపాలపల్లి 22, గద్వాల 32, కామారెడ్డి 54, కరీంనగర్ 129, ఖమ్మం 98, ఆసిఫాబాద్ 15,మహబూబ్నగర్ 46, మహబూబాబాద్ 76, మంచిర్యాల 57, మెదక్ 42, మేడ్చల్ మల్కాజ్గిరి 172 , ములుగు 16, నాగర్కర్నూల్ 50, నల్గొండ 164,నారాయణపేట్ 14, నిర్మల్ 32, నిజామాబాద్ 89, పెద్దపల్లి 56, సిరిసిల్లా 41, రంగారెడ్డి 216, సంగారెడ్డి 97, సిద్ధిపేట్ 87, సూర్యాపేట్ 78,వికారాబాద్ 11, వనపర్తి 38, వరంగల్ రూరల్ 18,వరంగల్ అర్బన్ లో 108, యాదాద్రిలో మరో 43 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా వైరస్ దాడిలో మరో 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,52,602 కి చేరింది. అయితే వీరిలో 1,05,295 (69శాతం) మంది అసింప్టమాటిక్, 47,307 (31శాతం) మందికి సింప్టమాటిక్తో వైరస్ తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 32,195 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 25,240 మంది హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 940 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.
950కి చేరువలో కరోనా మరణాలు…
రాష్ట్రంలో కరోనా వైరస్ దాడిలో 940 మంది చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అయితే దేశ మరణాల సగటు 1.67 ఉండగా, తెలంగాణలో కేవలం 0.67 శాతం మాత్రమే డెత్రేట్ ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.