Wednesday, May 1, 2024

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కెసిఆర్ కృషి: ఎంపి బండ

- Advertisement -
- Advertisement -

Telangana govt increase farmers income

ఢిల్లీ: హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపి బండ ప్రకాశ్ కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిసే తీర్మానంపై ఎంపి బండ ప్రకాశ్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తామని చెప్పారు. దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. తెలంగాణ తర్వాతే కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తోందన్నారు. కేంద్రం ఏర్పాటు చేయనున్న 7 మెగా టెక్స్‌టైల్స్ పార్కుల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కును చేర్చాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News