Wednesday, May 1, 2024

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ

- Advertisement -
- Advertisement -

ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీరిలో జిహెచ్‌ఎంసిలో శానిటేషన్ విభాగానికి అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.ఎస్. రాహూల్ రాజ్‌ను కుమరమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్‌గా బదలీ చేస్తున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడ కలెక్టర్‌గా వ్యవహరించిన సందీప్‌కుమార్ ఝా బదిలీ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ అబ్దుల్ అజీమ్‌ను కూడా అక్కడి నుంచి బదిలీ చేసి, ఆ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ బాధ్యతలను ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చీఫ్ సెక్రటరీ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.

Telangana Govt Transferred to 2 IAS officers

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News