- Advertisement -
దుబాయి: యూఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్లో జట్టును ఫైనల్కు చేర్చడంలో విఫలమై ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆర్సిబి కోచ్ సైమన్ కటిచ్ అండగా నిలిచాడు. జట్టు ఓటమై నేపథ్యంలో కొందరూ కోహ్లిపై అదే పనిగా విమర్శలు చేయడాన్ని కటిచ్ తప్పుపట్టాడు. మరికొన్నేళ్ల పాటు బెంగళూరుకు కోహ్లి సేవలు ఎంతో అవసరమన్నాడు. రానున్న ఐపిఎల్ సీజన్లో కోహ్లినే సారధిగా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో విరాట్ను మించిన కెప్టెన్ లేడని ప్రశంసించాడు. గతంతో పోల్చితే ఈసారి ఐపిఎల్లో బెంగళూరు బాగానే ఆడిందన్నాడు. పరిస్థితులు అనుకూలించక పోవడం వల్లే పరాజయం ఎదురైందన్నాడు. అంత మాత్రాన కోహ్లి కెప్టెన్సీని తక్కువ చేసి చూడడం సరికాదని కటిచ్ హితవు పలికాడు.
Don’t Criticize to Virat Kohli says RCB Coach Katich
- Advertisement -