Saturday, May 18, 2024

తెలంగాణలో కొత్తగా 173 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 173 New Corona Cases

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,844 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 173 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. సోమవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,72,650కు పెరిగింది. తాజాగా 168 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,64,933 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,967కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,754 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Telangana Reports 173 New Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News