ఎస్సి, ఎస్టి, బిసి, జనరల్ గురుకులాల్లో 46,937 సీట్లు
హైదరాబాద్: గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష(టిజి సెట్-) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను టిజిసెట్ కన్వీనర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సి, ఎస్టి, బిసి, జనరల్ కేటగిరీలకు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో 46,937 సీట్ల భర్తీకోసం టిజిసెట్ నిర్వహించారు. ఇందులో సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో 18,560 సీట్లు, గిరిజన సంక్షేమ సొసైటీలో 4,777 సీట్లు, బిసి గురుకులాలలో 20,800 సీట్లు, జనరల్ గురకులాలలో 2,800 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా విడుదలైన ఫలితాలను www. tswreis.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టిజిసెట్ ఫలితాలలో గురుకుల పాఠశాలల్లో మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు ఈ నెల 7 నుంచి 19వరకు ఆయా పాఠశాలల్లో రిపోర్ట్ చేసి టిసి, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, బోనోఫైడ్ వంటి అవసరమైన ధృవపత్రాలు సమర్పించి తమ అడ్మిషన్ను ఖరారు చేసుకోవాలని తెలిపారు.