Tuesday, May 14, 2024

గడువులోపు పోడు పట్టాల పంపిణీని పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎస్ శాంతికుమారి

రంగారెడ్డి: పోడు పట్టాల పంపిణీ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. పోడు పట్టాల పంపిణీ, గృహ లక్ష్మి, ఎరువులు-విత్తనాల నిల్వలు, ఆయిల్ పామ్ సాగు, నివేశన స్థలాల అందజేత, కస్టమ్ మిల్లింగ్, తెలంగాణకు హరితహారం, బిసిలకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ పోడు పట్టాల పంపిణీలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారం రోజుల్లోపు అన్ని జిల్లాలలో పట్టాల పంపిణీ పూర్తి చేయాలని గడువు విధించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సూచించారు. లబ్దిదారులకు రైతు బంధు ద్వారా ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా వారి బ్యాంకు అకౌంట్ వివరాలను సేకరించాలన్నారు.

కాగా, గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీ.ఎస్ కలెక్టర్లకు సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యూరియా, డీ.ఏ.పీ, కాంప్లెక్స్ ఎరువుల నిల్వల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలన్నారు. ఆయిల్ పామ్ సాగు విషయమై సిఎస్ సమీక్షిస్తూ, ఖరీఫ్ సీజన్లో ఎక్కువ మంది రైతులు ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా కృషిచేయాలన్నారు.

గతేడాది తరహాలోనే పకడ్బందీ ప్రణాళికతో లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,00,00 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉన్నందున, అవకాశం ఉన్న ప్రతి చోటా రైతులు దీని సాగుకు ముందుకు వచ్చేలా వారిని ప్రోత్సహించాలని, అవసరమైతే అంకితభావంతో పనిచేసే అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించి క్షేత్రస్థాయిలో కృషి చేయాలన్నారు. రైతులకు వెంటదివెంట పరిపాలనా పరమైన అనుమతులు జారీ చేస్తూ, సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, ఆయిల్ పామ్ మొక్కలను అందించాలని ఆదేశించారు.

అలాగే అర్హులైన వారికి నివేశన స్థలాల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే పట్టాలు అందించిన చోట వారికి కేటాయించిన స్థలాల్లో లబ్దిదారులే ఉంటున్నారా? లేదా? అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలన్నారు. కాగా, రైస్ మిల్లులకు సీఎం ఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని నిర్దిష్ట గడువులోగా మిల్లింగ్ జరిపి బియ్యం నిల్వలు గోడౌన్ లకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేలా చొరవ చూపాలన్నారు. రోడ్లకు ఇరువైపున, చెరువులు, కాల్వ గట్లపైన, ఇరిగేషన్ భూములు, అటవీ ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొ క్కలు నాటేలా గుంతలు తవ్వించాలని సూచించారు. వర్షం అనుకూలించిన వెం టనే మొక్కలు నాటేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలన్నారు. బీసీ లకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం, గొర్రెల పంపిణీ తదితర పథకాల అమలు తీరు, ప్రగతిని సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని సిఎస్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ సహకార సంఘాలలో సరిపడా ఎరువులు డీలర్ల వద్ద ఉంచామని వి వరించారు. హరిత హారంలో ఈ సంవత్సరం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతీక్ జైన్ తిరుపతి రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News