Wednesday, May 15, 2024

ప్రజలే పాలకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పని చేస్తోందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. నియంత పోకడలను పాతర పెట్టి, రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నమని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురేశారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్ర జలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలన్న మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలి
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని రేవంత్ అన్నారు. ప్రజల పోరాటంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందన్నారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ శోభతో కళకళలాడుతోందని, రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాలన్నీ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయ్ అని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News