Friday, May 3, 2024

పరిశ్రమల కోసం రాష్ట్రంలో అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది

- Advertisement -
- Advertisement -

మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుంది
ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో….
2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు దేశంలోనే తయారు
అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ వారి అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కెటిఆర్ భూమి పూజ

హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. 2030 నాటికి 60 శాతం ఈ- బ్యాటరీలు దేశంలోనే తయారవుతాయన్నారు. గిగా కారిడార్‌లో భాగంగా హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిందన్నారు. మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిన తర్వాత ఎన్నో గొప్ప సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని కెటిఆర్ కొనియాడారు.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం జహీరాబాద్‌ను ఎంపిక చేశామని కెటిఆర్ తెలిపారు. యువ నైపుణ్యాన్ని ఒడిసిపట్టడంలో టిఎస్‌ఐఐసీ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. పరిశోధన, డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉందని కెటిఆర్ చెప్పారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ నిలుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న జయదేవ్ గల్లాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతిరోజు కొత్తదనం ఉండేలా అమరరాజా కృషి చేస్తుందన్నారు. రెండు రోజుల క్రితం కోల్డ్‌చైన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని కెటిఆర్ తెలిపారు. ప్రస్తుతం ఎనర్జీ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అమర్‌రాజా చైర్మన్ గల్లా జయదేవ్, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నీతిఅయోగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సలహాదారు సుధేందు సిన్హాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News