Monday, April 29, 2024

బిజెపిలో ఎందరో మున్నాభాయ్‌లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపిపై రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. బిజెపిలో చాలా మున్నాభాయ్, ఎంబిబిఎస్ రకాలు ఉన్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి ఎంపిలు కూడా నకిలీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారని ఆరోపించారు. రాజస్థాన్, తమిళనాడు విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్దాలు చెప్పడం క్రిమినల్ నేరం కాదా? అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ దీనిని నిర్దారించకూడదా? దోషులుగా తేలితే అనర్హత వేటు వేయచ్చు కదా? అని అన్నారు.

ఈ మేరకు కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే డిగ్రీ సరిఫ్టికేట్ల విషయంలో ప్రధాని మోడీ టార్గెట్‌గా బిఆర్‌ఎస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను పుణె యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో బిజినెస్‌లో మాస్టర్ డిగ్రీ చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ కుమార్తె, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత భారతదేశంలో నిజమైన డిగ్రీలు ఉన్నవారికి ఉద్యోగం రాదని.. డిగ్రీలు లేనివారికి ఉన్నత ఉద్యోగం ఉందని కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News