Sunday, April 28, 2024

మెగా డిఎస్ సి

- Advertisement -
- Advertisement -

టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టండి

డిఎస్‌సి నిర్వహణకు ఏర్పాట్లు చేయండి
ఉపాధ్యాయుల పదోన్నతులు,
బదిలీల్లో సమస్యలను పరిష్కరించాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
విద్యాశాఖపై సిఎం ఉన్నత స్థాయి సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి పంచాయతీలో బడి ఉండాలని శనివారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో సిఎం అన్నారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే అని స్పష్టం చేశా. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని, విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలని సిఎం ఆదేశించారు.

ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే అని సిఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. దీనికోసం వెంటనే మెగా డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని సిఎం విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డి.ఎస్.సి నిర్వహించేందుకు తగి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సిఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సిఎం అధికారులను ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను నియమించడానికి ఉన్న మార్గాల గురించి అధికారులను తగిన ఆదేశాలను జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం విద్యాశాఖకు చెందిన పలు అంశాలపై సిఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ శ్రీదేవసేన, సి.ఎం.ఓ అధికారులు శేషాద్రి, షా-నవాజ్ కాసీం తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సి.ఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. ఈ విషయంలో గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ఈ విధమైన స్కిల్ యూనివర్సిటీలని అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకుగాను, విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీని నియమించి తగిన ప్రతిపాదనలను సమర్పించాలని సిఎం రేవంత్‌రెడ్డి సిఎస్‌ను ఆదేశించారు.

There should not be a panchayat without a school

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News