- Advertisement -
హైదరాబాద్ : భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు బుధవారం ఉపసంహరించబడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దిగువ ట్రోపోస్పియర్ స్థాయి వద్ద ఈ శాన్య దిశగా గాలులు వీయడం ద్వారా తమిళనాడు, పుదుచ్ఛేరి, కోస్తాంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయని తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగలల మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Three days dry weather in Telangana
- Advertisement -