Friday, April 26, 2024

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మాడ్గుల మండలం చంద్రయానపల్లి వద్ద ట్రాక్టర్ అతివేగంతో ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటన స్థలిలో మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు మాడ్గుల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహలను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News