Thursday, May 2, 2024

బోర్‌వెల్‌ను ఢీకొన్న ఇన్నోవా.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Three people were killed in collision between Borewell and an Innova

 

హైదరాబాద్‌: బోర్‌వెల్, ఇన్నోవా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సంభవించింది. ఇవాళ ఉదయం ఓ బోర్‌వెల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడ్‌బండ్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న ఇన్నోవా కారు చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్‌ శివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ సహా మరో ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌కు చెందిన అసిఫ్‌ఖాన్‌, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభానుగా గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News