- Advertisement -
ముగ్గురు దొంగల్లో, ఒకరు మైనర్
నాలుగు బైక్లు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : మోటార్ సైకిళ్లను చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్లు, ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని యూసుఫ్గూడకు చెందిన ఎండి ఇస్మాయిల్ అలియాస్ సోహైల్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. బంజారాహిల్స్ ఇందిరానగర్కు చెందిన ఉదారాల రమేష్ నిరుద్యోగి ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో బైక్లను చోరీ చేస్తున్నారు. మైనర్ బాలుడు రెండు బైక్లను చోరీ చేశాడు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు వేర్వేరుగా చోరీలు చేస్తున్నారు. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. దొంగలను అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ డిఐ రమేష్, డిఎస్సై హరీశ్వర్ రెడ్డిని ఎసిపి కెఎస్ రావు అభినందించారు.
- Advertisement -