Sunday, May 19, 2024

నేటి నుంచి గురకుల నియామక పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ట్రిబ్ )కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 23 వ తేదీ వరకు జరిగే పరీక్షలకు 17 జిల్లాలలో 106 పరీక్ష కేంద్రాలను ఏ ర్పా టు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపా రు. మొదటి సారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఈ ప రీక్షలు రోజుకు మూడు షిఫ్ట్‌లలో జరుగుతాయని తె లిపారు. అభ్య ర్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషా ల ముందే చేరుకోవాలని, హాల్ టికెట్ తో పాటు ఏ దైనా ఫోటో ఐడి కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ప్రశ్న పత్రం ఓపెన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను పరీక్ష ప్రారంభం కావడానికి 10 నిమిషాల ముందు మాత్రమే అభ్యర్థులకు అందిస్తారని ఆయన సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ఖాళీగా ఉన్న 9,210 పోస్టులకు గాను 2,63,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని మల్లయ్య బట్టు తెలిపారు. పరీక్షలు మూడు షిఫ్ట్ లలో జరుగుతున్నాయని, ఒక్కో పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుందని ఉదయం 8:30- గం.ల నుండి 10:30 గం.ల వరకు, మధ్యాహ్నం 12:30 గం.ల నుండి -2:30 గం.ల వరకు, సాయంత్రం 4:30- గం.ల నుండి 6:30 గం.ల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. 2,3 పరీక్షలు రాసే వారు తమ హల్ టికెట్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయని, ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనవసరమైన వదంతులను నమ్మవద్దని మల్లయ్య బట్టు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News