- Advertisement -
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ సోషల్ మీడియా లోకి రీ ఎంట్రీ కానున్నారు. ఫేస్బుక్, ట్విటర్ తదితర వేదికలన్నీ ఆయన ఖాతాలను నిషేధించినందున తాను స్వంతంగా కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభిస్తారని, దాని ద్వారా నెటిజన్ల ముందుకు వస్తారని సమాచారం. రెండు మూడు నెలల్లో ఈ కొత్త సామాజిక వేదికను ట్రంప్ ప్రారంభిస్తారని ఆయన సీనియర్ సలహాదారుల్లో ఒకరైన జేసస్ మిల్లర్ మీడియాకు తెలిపారు. 2020 ఎన్నికల్లో ట్రంప్కు అధికార ప్రతినిధిగా మిల్లర్ పనిచేశారు. కొత్తవేదికను రూపొందించడానికి అనేక కంపెనీలు ట్రంప్తో సంప్రదిస్తున్నాయని మిల్లర్ చెప్పారు.
- Advertisement -