Friday, May 3, 2024

ఒమిక్రాన్‌తో పోరుకు పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలి

- Advertisement -
- Advertisement -

TS Cabinet Ordered to medical health department on Omicron

వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర కేబినెట్ ఆదేశం, 2గం.పాటు సాగిన మంత్రివర్గ భేటీ , ఒమిక్రాన్ గురించి వివరించిన అధికారులు
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నుంచి ఒమిక్రాన్ పేరుతో కొత్త ఒరియెంట్ వస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి వైద్యశాఖ పూర్తిస్థాయిలో సిద్దంగా ఉండాలని రాష్ట్ర కేబినెట్ ఆదేశించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని దవాఖానాలల్లోని పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచించింది. అలాగే అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. సోమవారం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. మొదటగా రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్టుమెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్ సమగ్రంగా సమీక్షించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు.

కరోనా పరీక్షలు మరిన్ని ఎక్కువగా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సన్నద్దతపై కేబినెట్ చర్చించింది. సందర్భంలో ఒమిక్రాన్ వేరియంట్ గురించి వైద్య అధికారులు కేబినెట్‌కు కూలంకషంగా వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితిని తెలిపారు. నివేదిక సమర్పించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడికోసం జరిగిన పురోగతి మీద కేబినెట్ చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. అన్ని రకాలుగా తాము సంసిద్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియను సమీక్షించి, ఆదిలాబాద్, కుమురంభీం నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

సబ్ కమిటీ ఏర్పాటు

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి , టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా ఒక సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరు సభ్యులుగా ఉంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News