Tuesday, May 14, 2024

దోస్త్ రిజిస్ట్రేషన్ల గడువు మరోసారి పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు.ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 4వ తేదీన 31వ తేదీన దోస్త్ మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడత సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 9 వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అన్నారు. దోస్త్ రెండవ విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఆగస్టు 5 ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 25న రెండవ విడత సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. డిగ్రీ ప్రవేశాల కోసం శనివారం వరకు 1,88,720 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. అందులో 1,80,103 మంది ఫీజు చెల్లించగా, 1,56,359 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

TS Dost 2021 Registration date extend again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News