- Advertisement -
హైదరాబాద్: మాజీ సైనికులు, పారా మిలటరీ, పోలీస్, ఎక్సైజ్ అధికారుల ఎంపానల్ మెంట్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని క్యాడర్లు, ర్యాంకుల అధికారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ధరఖాస్తుల కోసం https//transport.tleangana.gov.inను సందర్శించాలంటూ సిఎస్ ప్రకటన జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోవిడ్-19 నేపథ్యంలో పేషెంట్ల సంరక్షణ, వాళ్ల అవసరాలు.. భద్రతా బాధ్యతలను మాజీ సైనికులు, పోలీసులకు ప్రభుత్వం అప్పగించనుంది. ఎంపానల్ మెంట్ సమాచార వివరాలను ప్రభుత్వం ఆన్ లైన్ లో పొందుపర్చింది.
TS Govt to release Notification for Empanelment
- Advertisement -