- Advertisement -
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రగ్స్ కలకలం కొనసాగుతోంది. తాజాగా బుల్లితెర నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్సిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. దీంతో ఆమెను కిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్టటు పోలీసులు వెల్లడించారు. ‘దేవోకె దేవ్’, ‘సంవాదన్ ఇండియా’ వంటి సీరియల్స్ లో నటించిన ప్రీతికా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రీతికాను విచారిస్తే ఈ కేసులలో మరన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఎన్సిబి అధికారులు భావిస్తున్నారు. అయితే నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది.
TV actress Preetika Chauhan arrested by NCB
- Advertisement -