- Advertisement -
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని కేంద్రమంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు. ప్రధాని మోడీ కూడా ఇప్పటికే దీనిపై ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఒక్కో వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ. 500 ఖర్చువుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. మన దేశ సైంటిస్టులు కొన్ని రకాల వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారని అవి క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని ప్రధాని చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో బిజెపి ఉచిత కరోనా వ్యాక్సిన్ ప్రకటన చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Indians to Get Free COVID Vaccine Says Pratap Sarangi
- Advertisement -