- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 79 లక్షలు దాటాయి. గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 45,149 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 480 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 59,105 కొత్తగా డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసులు 79,09,960కు పెరిగాయి. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 1,19,014కి చేరుకుంది. ఇండియాలో ప్రస్తుతం 6,53,717 యాక్టివ్ కేసులుండగా… 71,37,229 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, అక్టోబర్ 25 వరకు మొత్తం 10,34,62,778 మంది నమూనాలను పరీక్షించగా.. వీటిలో 9,39,309మంది బాధితులకు నిన్న టెస్టులు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.
45149 new covid 19 infections in india
- Advertisement -