Monday, May 6, 2024

వరుసగా క్రేజీ ప్రాజెక్టులు

- Advertisement -
- Advertisement -

Two crazy projects on Pooja Hegde account

రెండున్నర కోట్ల రెమ్యునరేషన్‌తో టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్ గా వున్న పూజా హెగ్డే ఖాతాలో రెండు క్రేజీ ప్రాజెక్టులు చేరాయి. ఇప్పటికే మహేష్ బాబు -సరసన సినిమా ఓకే చేసిన పూజ ఆ తరువాత -పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా చేయబోతోంది. దాంతో పాటే తమిళ హీరో ధనుష్-, వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీకి కూడా సై అనేసింది. ఈ మూడు సినిమాల డేట్‌లు చూసుకొని నితిన్‌తో సినిమా చేయడం అన్నది ఆధారపడి వుంటుందని తెలిసింది. మహేష్ బాబు సినిమా అయిపోయేసరికి పవన్ సినిమా ప్రారంభం అవుతుంది. పవన్ సినిమాతో పాటు సమాంతరంగా ధనుష్ సినిమా ప్రారంభమవుతుంది. ఇక హారిక హాసిని బ్యానర్‌లోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు చేసిన పూజ ఇప్పుడు మహేష్, ధనుష్ సినిమాలు చేస్తుండడం విశేషం.

Two crazy projects on Pooja Hegde account

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News