- Advertisement -
అమరావతి: గుంటూరు జిల్లాలోని శావల్యపురం మండలం కనమర్లపూడి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభివించింది. కారు- స్కార్పియో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
two died in road accident at guntur district
- Advertisement -