Friday, April 26, 2024

బంగ్లాదేశ్ మత హింసలో మరో ఇద్దరు హిందువుల మృతి

- Advertisement -
- Advertisement -

two Hindu men killed in Bangladesh religious violence

ఢాకా: మత హింసకు బంగ్లాదేశ్‌లో మరో ఇద్దరు హిందువులు బలయ్యారు. దీంతో, ఇటీవల జరిగిన హింసలో చనిపోయినవారి సంఖ్య ఆరుకు చేరింది. శనివారం పోలీసులు ఈ వివరాల్ని వెల్లడించారు. బుధవారం నుంచి బంగ్లాదేశ్‌లో మెజార్టీగా ఉన్న ముస్లింలు, మైనార్టీగా ఉన్న హిందువులకు మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. దుర్గాపూజ సందర్భంగా హిందూ దేవుని మోకాలి దగ్గర ఖరాన్‌ను పెట్టిన వీడియో ఫుటేజ్ వైరల్ కావడంతో అల్లర్లు ప్రారంభమయ్యాయి. తాజా అల్లర్లు బేగంగంజ్ పట్టణంలో జరిగాయి. దుర్గాపూజ చివరి రోజైన శుక్రవారం అల్లర్లు మొదలయ్యాయి. మసీదులో ప్రార్థనలు ముగించుకున్న దాదాపు 200మంది ముస్లింలు ఓ హిందూ ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఆలయం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఒకరిని కత్తులతో పొడిచి చంపారు. ఆలయం పక్కన ఉన్న చెరువు దగ్గర శనివారం ఉదయం మరో శవాన్ని గుర్తించారు. దోషుల్ని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News