- Advertisement -
న్యూఢిల్లీ : శనివారం మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరుకు 35 పైసల వంతున రిటైల్ ధరలు దేశమంతా కొత్తగా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు లీటరు పెట్రోలు ధర రూ.100 అంతకన్నా ఎక్కువగా ప్రధాన నగరాల్లో పెరిగింది. గోవా, బెంగళూరుల్లో డీజిల్ లీటరు రూ.100 కు చేరువైంది. లీటరు పెట్రోలు ఢిల్లీలో రూ.105.49, ముంబైలో 111.43,వరకు పెరిగాయి. అలాగే డీజిల్ లీటరు ముంబైలో రూ. 102.15,ఢిల్లీలో 94.22వరకు చేరింది. పెట్రోలు, డీజిల్పై లీటరుకు 35 పైసల వంతున పెరగడం ఇది వరుసగా మూడోసారి. దేశమంతా పెట్రోలు ధర దాదాపు ఒకేలా పెరగ్గా, డీజిల్ ధరలు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెరిగాయి. పనాజిలో డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 99.56, బెంగళూరులో 99.97 వరకు ఉన్నాయి.
- Advertisement -