Friday, April 26, 2024

ఆటో- బస్సు ఢీ : ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed

 

నవాబ్‌పేట : ఆటో-బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్‌పేట మండల పరిధిలోని మైసమ్మ దేవాలయం దగ్గర జరిగిన ప్రమాదంలో గుడిమల్కపూర్ గ్రామానికి చెందిన బొజ్జ లక్ష్మయ్య (30), మరో వ్యక్తి మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని వారు పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Two killed in auto bus collision
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News