- Advertisement -
అమరావతి: కంటైనర్కు కరెంట్ షాక్ తగలడంతో ఈ వాహనం నుంచి తప్పించుకునే క్రమంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాలి బూడిదైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోలసానపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. షేక్ మస్తాన్ (66), జోజిబాబు(38) అనే ఇద్దరు వ్యక్తులు మీర్జాపురంలో వ్యాపారం చేస్తారు. కోడిగుడ్ల కోసమని ఇద్దరు బైక్పై వట్టిగుడిపాడుకు వెళ్తున్న క్రమంలో పోలసానపల్లి వద్ద కంటైనర్కు కరెంట్ షాక్ తగలడంతో మంటలు చెలరేగాయి. వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ఇద్దరికి కరెంట్ షాక్ తగిలి చనిపోయారు. అప్రమత్తమైన డ్రైవర్లు, క్లీనర్లు ఘటనా స్థలం నుంచి పారిపోయారు.
- Advertisement -