- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 41,970 మందికి కరోనా టెస్టులు చేయగా 592 మంది సోకినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 643 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లగా ముగ్గురు చనిపోయారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2.81 లక్షలకు చేరుకోగా 1513 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.73 లక్షల మంది కోలుకోగా 6888 మంది చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 64.43 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -