- Advertisement -
నల్లొండ: జిల్లాలోని దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. ఆగిఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… అంబులెన్స్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను నెల్లూరు జిల్లాకు గుండాల కమాలాకర్ రెడ్డి(40), నందగోపాల్ రెడ్డి(75)గా గుర్తించారు. వీరిని చికిత్స కోసం నెల్లూరు జిల్లా నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Two patients dead in road accident At Nalgonda District
- Advertisement -