Sunday, May 5, 2024

దేశంలో మరో 64,531 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

64531 Covid 19 cases and 1092 deaths reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 64,531 కొత్త కోవిడ్-19 కేసులు, 1,092 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 27,67,274కు పెరిగింది. భారత్ లో 6,76,514 మంది కరోనా బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారినుంచి 20,37,871 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52,889మంది ఈ వైరస్ తో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఇండియాలో ఇప్పటివరకు 3,17,42,782మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది. కాగా ఆగస్టు 18 వరకు 8,01,518 మంది బాధితులు నమూనాలు పరీక్షించినట్టు ఐసిఎంఆర్ పేర్కొంది.

64531 Covid 19 cases and 1092 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News