- Advertisement -
మేడ్చల్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో విషాదం చోటుచేసుంది. భవనంపై నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్ జిల్లాలోని కొంపల్లిలో బుధవారం చోటుచేసుంది. చిన్నారి మనోజ్ భవనం రెండో అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవాశాత్తు కిందపడ్డాడు. దీంతో మనోజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం హూటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
three year old boy fell from building and died
- Advertisement -