Thursday, May 2, 2024

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1763 new covid 19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 1,763 కొత్త కోవిడ్-19 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 95,700కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 719కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 20,990 యాక్టివ్ కేసులుండగా.. 73,991 మంది కోలుకున్నారు. 24 గంటల్లో 1,789 మంది ఈ వైరస్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.7శాతం ఉండగా భారత్ లో 1.92శాతంగా ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 77.31శాతంగా ఉందని ఇది దేశ సగటుకంటే ఎక్కువ అని ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌ లో484, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 169, రంగారెడ్డిలో 166 కేసులు బయటపడ్డాయి. గత 24గంటల్లో 24,542 మందికి కరోనా టెస్టులు చేయగా… ఇప్పటి వరకు 7,97,470 మందికి బాధితులకు కోవిడ్ పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

1763 new covid 19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News