Friday, May 10, 2024

నిరుద్యోగులకు ఆన్‌లైన్ వల

- Advertisement -
- Advertisement -

online fruad

 

ఇంటి నుంచే ఆర్జించవచ్చని ఆశలు
బిల్డ్‌ఎంప్లాయిమెంట్.కామ్ పేరిట చీటింగ్
నిలువునా మోసపోతున్న యువకులు

మనతెలంగాణ/హైదరాబాద్: విదేశీ సంస్థలు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయంటూ ఆన్‌లైన్‌లో నిరుద్యోగులను నిలువునా దోపిడీచేస్తున్నారు. బిల్డ్‌ఎంప్లాయిమెంట్.కామ్ పేరిటలో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంటివద్దే ఉంటూ నెలకు వేతనాలు అందుకోవచ్చన ఆశలు కల్పిస్తూ నిరుద్యోగుల కు మోసం చేస్తున్న సంస్థలపై పోలీసులు సైతం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిల్డ్‌ఎంప్లాయిమెంట్.కామ్ లో ఒక నిరుద్యోగి రెండు వేల రూపాయలు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే మూడు నెలల తరువాత నెలకు రూ. 2వేల వేతనం ఇస్తామన్న ప్రకటనతో వేలాది మంది నిరుద్యోగులు ఆకర్షితులవుతున్నారు. ఆ సంస్థలో చేరినవారు మరొకరిని చేర్పిస్తే అదనంగా వేయి రూపాయలు కమీషన్ ఇస్తామని ఆ సంస్థ ప్రకటించడంతో తమ పెట్టుబడి తిరిగి వస్తోందన్న ఆశతో నిరుద్యోగులు తమ తోటి వారిని ఆ సంస్థలో చేర్పిస్తున్నారు.

అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో మరో ఎంఎల్‌ఎం సంస్థ యధేశ్చగా ఆన్‌లైన్ వస్తువుల పేరిట పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతోంది. ఆన్‌లైన్ (ఎంఎల్‌ఎం) సంస్థలపై సుప్రీం కోర్టు కొరఢా ఝలిపించిన్పటికీ సైలెంట్‌గా ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాల కొనసాగుతూనే వున్నాయి. ఇటీవల కాలంలో ఓ సంస్థ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతోంది. రూ. 10 వేల నుంచి రూ.20వేలు వసూలు చేస్తూ చైన్‌లింక్ సిస్టంతో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి రూ. 20వేలు పెట్టి చేరడంతో పాటు మరో నలుగురిని రూ. 20వేలు చెల్లించాలని, దీంతో విహార యాత్రలు, ప్రత్యేక బహుమతులు సొంతమౌతాయని ప్రకటిస్తూ మదుపరులను ఆకర్షిస్తోంది. గతంలో మునక్కాయ. కరక్కాయ, పల్లీకాయ పేరిట మోసాలు వెలుగు చూస్తున్న తరుణంలో సదరు సంస్థ మోసగించేందుకు ఆన్‌లైన్ వస్తువుల పేరిట వసూళ్లకు పాల్పడుతోంది.

రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజానంతో చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాన మోసాలు మాత్రం ఆగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు అధికంగా చోట చేసుకుంటున్నాయని గుర్తించిన అధికారులు తీరా నేరం జరిగిన తరువాత ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించి వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా సారించడంతో పాటు గతంలో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన వారి డేటాను పూర్తిస్థాయిలో సేకరించడంలో పోలీసులు విఫలమౌతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నేరాలకు పాల్పడిన వారు ప్రస్తుతం ఎక్కడున్నారన్న సమాచారం సేకరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే నేర చరిత్ర ఉన్న సంస్థల భాగోతాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు.

తెలంగాణ రాష్ట్రంలో నేరం చేసేందుకు నేరస్తులు భయపడాలి, నేరం చేసిన వారికి శిక్షపడేంతవరకు పోలీసులు వెంటపడాలని పోలీసు బాసుల ఆదేశాల అమలు విషయంలో కిందిస్థాయి సిబ్బంది అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో వివిధ నేరాలకు పాల్పడి జైళ్లలో ఉన్నవారి కోసం ములాఖత్‌లలో వస్తున్న వారి వివరాలను సేకరించడం, ఆపై నేరస్తులను కుటుంబ సభ్యులు కాకుండా ఇతర నేరస్తులు కలిసి పెద్ద నేరాలకు కుట్రలు చేస్తున్న అంశాలపై పోలీసులు శీతకన్నువేయడం విచారకరం. ఇదిలావుండా అర్థిక నేరాలకు పాల్పడుతున్న 2019లో జూన్ 30 నాటకి 141మందిపై పిడి యాక్ట్ ప్రయోగించినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వారు ఎక్కడు వున్నారు, మరోరూపంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారా? అని ఆరా తీయడంలేదన్న ఆరోపణలున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను సైతం చైతన్యవంతం చేసేందుకు సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారీ ఎత్తున ఆర్థిక మోసాలు, కృరమైన నేరాలు చేసిన వారి కదలికలను గుర్తించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఫేస్ రికగ్నేషన్ ఆర్థిన నేరగాళ్లపై ప్రయోగిస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమౌతాయి.

తప్పి పోయిన వారి ఆచూకీ కోసం వినియోగిస్తున్న సాంకేతిక పరిజానాన్ని ఇకపై బడా నేరస్తుల కదలికల కోసం వినియోగిస్తే పెద్ద పెద్ద నేరాలు చోటుచేసుకోకుండా నివారించడం సాధ్యమౌతుందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. నేరాలు జరిగిన తరువాత పోలీసులు స్పందించడం కంటే నేరాలను నియంత్రించడంలో పోలీసులు ముందడుగు వేయాలని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. తాజాగా ఆన్‌లైన్ పేరిట నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట దోపిడీకి పాల్పడుతున్న సంస్థలపై పోలీసులు దృష్టిసారిస్తారని ఆశిద్దాం.

Unemployed are being exploited Online
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News