Friday, May 10, 2024

జర్నలిస్టుపై కాల్పులు…

- Advertisement -
- Advertisement -

లక్నో: 25 ఏళ్ల జర్నలిస్టును గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చడంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిడి నగర్‌లో మన్ను అవస్తి అనే జర్నలిస్టు నివాసం ఉంటున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరపడంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: ఢిల్లీకి పొంగులేటి, జూపల్లి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News