Tuesday, May 14, 2024

అంగన్ వాడీ పంతులమ్మపై అత్యాచారం… హత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: అంగన్ వాడీ కార్యకర్తపై అత్యాచారం చేసి హత్యా చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని యుగైతి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బుదౌన్ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తలో మృతి చెందిన విషయం స్థానికులు సమాచారం ఇవ్వడంతో తన సిబ్బంది కలిసి ఎస్ పి సంకల్ప్ శర్మ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తను అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని యుగైతి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అంగన్వాడీ కార్యకర్త బంధువుల ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై 376, 302 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పట్టుకోవడం కోసం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News