- Advertisement -
లక్నో : 2020-2021 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఆ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కె తివారీ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అనుకోని పరిస్థితుల్లో అత్యవసర బదిలీల విషయంలో ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కొవిడ్19 ఉధృతి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
యుపిలో ఇప్పటి వరకు 3664 కేసులు నమోదు కాగా,82మంది మరణించారు.
- Advertisement -