Sunday, April 28, 2024

మహిళపై 39 మంది అత్యాచారం… పిఎస్‌లో ఫిర్యాదు 

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో ఓ మహిళ తనపై 39 మంది అత్యాచారం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళ తనపై నలుగురు వ్యక్తులు తెలిసినవారు అత్యాచారం చేయగా తనకు తెలియని 35 మంది గత సంవత్సరం నుంచి అత్యాచారం చేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ భర్త మందుబాబు కావడంతో గ్రామంలో 39 మంది వద్ద 2.5 లక్షల రూపాయల అప్పులు చేశాడు. తమకు ఉన్న ఆస్తులను అమ్మిన తరువాత అప్పులు చెల్లిస్తానని పలుమార్లు బకాయిపడ్డవారికి తెలిపాడు. అస్తులు అమ్మిన తరువాత అప్పులు చెల్లించకపోవడంతో వారు ఆమె భర్తపై ఒత్తిడి తెచ్చారు. తన భార్యతో తప్పుడు ఫిర్యాదు చేయించినట్టు ఎస్‌పి శైలేష్ పాండే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తమ గ్రామానికి చెందిన నలుగురు అమిత్, శంభు, చామాన్, పుష్పేంద్ర అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలపడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆ నలుగురిపై ఐపిసి 376 డి గ్యాంగ్ రేప్, 392 దొంగతనం, 323, 506, 66 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పలు పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.

UP woman claims rape by 39 men, complaint on PS, 32-year-old woman who filed cases of rape against four identified and 35 unidentified persons

 

UP woman claims rape by 39 men, complaint on PS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News