- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కడప జిల్లా ఎద్దడుగు కనుమ దగ్గర రెండు బస్సులు ఢీకొన్నాయి. ఆర్టిసి బస్సును గుజరాత్ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా కల్లుపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ను వెనక నుంచి విద్యార్థుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అనంతపురం విద్యార్థులు విహార యాత్రకు కొడైకెనాల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ రెండు ప్రమాదాల్లో 30 మంది వరకు గాయపడి ఉంటారని సమాచారం.
30 Members Injured in Bus Accident in Andhrapradesh, Two road accident in andhra, Bus collided to bus in kadapa, School bus Collided t o Petrol tanker
30 Members Injured in Bus Accident in Andhrapradesh
- Advertisement -