Tuesday, April 30, 2024

వైష్ణవ్ ప్రేక్షకుల మెప్పు పొందుతాడు

- Advertisement -
- Advertisement -

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి ఈ చిత్రం ట్రైలర్‌ను, ప్రమోషనల్ కంటెంట్‌ను చిత్ర కథానాయకుడు వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చూపించారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని చిత్ర బృందాన్ని పవన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రంలోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్‌తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. మనకు పరిచయం ఉన్న జీవితాలను, అందులోని ఎమోషన్స్‌ను మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. ‘ఉప్పెన’ కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబు, చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. ‘ఉప్పెన’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

Uppena film will be remembered: Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News