లక్నో: గుళ్లోకి వచ్చాడని 17 ఏళ్ల దళిత యువకుడిని అగ్రకులానికి చెందిన వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దోమ్ ఖేరా గ్రామంలో వికాస్ జాతవ్ అనే దళిత యువకుడు మే-31 దేవాలయం లోపలికి వెళ్తుండగా అగ్రకులానికి చెందిన లాలా చౌహాన్, హోరమ్ చౌహాన్, భూషణ్, జశ్వీర్ అనే వ్యక్తులు అడ్డగించారు. దీంతో యువకుడు వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా అలసత్వం వహించారు. గత శనివారం రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు ఆ నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి వికాస్పై కాల్పులు జరిపిపారిపోయారు. వెంటనే కుటుంబ సభ్యుల అప్రమత్తమై వారిని వికాస్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్పి విపిన్ తాడా ఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మర్డర్పై 302, ఎస్సి, ఎస్టి యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.