Sunday, April 28, 2024

కెసిఆర్ సార్… చాలా థ్యాంక్స్!

- Advertisement -
- Advertisement -

నా గెలుపుకు కారణమైన మీకు ప్రత్యేకంగా అభినందనలు
ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసిన సురభీ వాణిదేవి

Vani devi won in MLC elections

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్.. -రంగారెడ్డి…- మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఎంఎల్‌సిగా పోటీ చేసి విజ యం సాధించిన సురభి వాణీ దేవి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంఎల్‌సి అభ్యర్థిగా తనకు అవకాశమిచ్చి, అన్నీ తానై తన గెలుపునకు కారణమైన సిఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వాణిదేవిని సిఎం కెసిఆర్ అభినందించారు. శాలువాతో సత్కరించారు. వాణిదేవికి విజయాన్ని కట్టబెట్టిన అన్నివర్గాల పట్టభద్రులకు సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. వాణీదేవి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంఎల్‌సిలు కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, నవీన్ రావు, శాసనసభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి, కె.పి.వివేకానంద, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపి మందాజగన్నాధం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News