- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ పై ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. గురువారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలలో బిజెపితో కాంగ్రెస్ పార్టీ నాయకులు అపవిత్ర పొత్తు పెట్టుకున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనైతికమని, సిద్ధాంతాలకు విరుద్దంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని విహెచ్ ధ్వజమెత్తారు. బిజెపితో పొత్తు విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
- Advertisement -