- Advertisement -
అమరావతి: సిబిఐ మాజీ అధికారి జెడి లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికలలో జెడి విశాఖ పట్నం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పంపించారు. పవన్ రాజకీయ పార్టీ స్థాపించిన తరువాత పూర్తిగా ప్రజాసేవకే జీవితం అంకితం చేస్తానన్నాడని, కానీ ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాల్లో నటిస్తుండడంతో అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు. పవన్కు విధివిధానాల్లో నిలకడ లోపించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు, తనకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను వ్యక్తిగతంగా జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, పౌరులకు తోడుగా ఉంటానని అభయమిచ్చారు.
CBI JD Laxmi Narayana resigned to Jana sena Party
- Advertisement -