- Advertisement -
కరీంనగర్: జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం కావాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతితో పల్లెలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని, వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిఎ కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పని చేయాలన్నారు. మిషన్ భగీరథ పనుల జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చ్ 31లోగా ఇంటింటికి మిషన్ భగీరథ ఫలాలు అందించాలని అధికారులకు సూచనలు చేశారు.
Villages developed with Palle Pragathi in Telangana
- Advertisement -