Monday, May 6, 2024

కేరళలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు

- Advertisement -
- Advertisement -

coronavirus

న్యూఢిల్లీ: కేరళలో మొట్టమొదటి కరోనా వైరస్ కేసు అధికారికంగా నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణైంది.ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించగా నోవెల్ కరోనావైరస్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ ఉన్నట్లు తేలిందని, ప్రస్తుతం ఆ రోగిని ఆసుపత్రిలో విడిగా ఉంచి చికిత్సలు అందచేస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఆ రోగి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వుహాన్ నగరంలో ప్రబలిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 170 మందిని పైగా బలిగొంది.

Kerala reports first confirmed case of coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News