Saturday, April 27, 2024

సిఎఎ నిరసనకారులపై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా మిలియా ప్రాంతంలో ప్రదర్శన నిర్వహిస్తున్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై గురువారం ఒక గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ కాల్పులు జరపగా ఒక విద్యార్థి గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జామియా మిలియా విద్యార్థులతోపాటు నిరసనకారులు రాజ్‌ఘాట్ వైపు ప్రదర్శనగా వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన విద్యార్థిని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హరినగర్ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి తేజీందర్ పాల్ సింగ్ బగ్గా సిఎఎకి వ్యతిరేకంగా గడచిన రెండు నెలలుగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై ఫిబ్రవరి 11న ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజున సర్జికల్ స్ట్రైక్ జరుపుతామని గురువారం హెచ్చరించారు. షహీన్‌బాగ్‌ను దేశద్రోహుల స్థావరంగా అభివర్ణించిన బగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజునే అక్కడ సర్జికల్ స్ట్రైక్ జరుపుతామని హెచ్చరించారు.

Man opens fire on CAA Protesters

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News