- Advertisement -
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్సేన్ రెడ్డిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఆయన శనివారం న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్ 1970 ఆగస్టు 22న హైదరాబాద్లో జన్మించారు. పీఆర్ఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ చేశారు. 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాస్, కేరళ హైకోర్టుల చీఫ్ జడ్జిగా, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్గా, రాష్ట్ర లోకాయుక్త గా పనిచేసి 2019లో దివంగతులైన జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డికి ఆయన కుమారుడు
Vijaysen Reddy as High Court Judge
- Advertisement -