Friday, April 26, 2024

స్వీయ నిర్బంధంలో విరుష్కలు

- Advertisement -
- Advertisement -

Virat Kohli - anushkasharma

 

ముంబై: కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోయారు. దీనికి సంబంధించిన వీడియోను విరుష్కలు అభిమానులతో పంచుకున్నారు. కరోనా మహమ్మరి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ఎవరికీ వారే స్వీయ నిర్బంధం విధించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్నట్టు చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహమ్మరిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించక తప్పదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న ఈ వైరస్‌ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని విరుష్కలు సూచించారు. అంతేగాక భారత ప్రధాని పిలుపు నిచ్చిన జనతా కర్ఫూను విజయవంతం చేయాలని కోరారు.

Virat Kohli couple self imprisonment
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News